దేశ ఆర్థిక రాజధాని ముంబైని గత కొన్ని నెలలుగా డ్రగ్స్ భూతం పట్టిపీడిస్తోంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి.
డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కు తాజాగా టీవీ నటి ప్రీతికా చౌహన్ దొరికింది. డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెండ్గా ఎన్సీబీ చేతికి చిక్కింది.
‘సంవాదన్ ఇండియా’, ‘దేవో కె దేవ్ మహదేవ్’ వంటి సీరియళ్లలో నటించిన ప్రీతికా మంచి పేరు సంపాదించుకుంది. కిల్లా కోర్టులో ఆమెను ప్రవేశపెట్టనున్నట్టు పోలీసులు తెలిపారు.