పరకాల నియోజకవర్గం లోని పరకాల మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బండారీ రజిత-కుమారస్వామి మరియు వార్డు మెంబర్లు బొచ్చు తిరుపతి, పసుల దేవేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరు,అభివృద్ధి చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరుతున్నారని,తెలంగాణ ప్రజల సంక్షేమమే ద్వేయంగా కృషి చేస్తున్న తెరాస పార్టీ పై నమ్మకం తోనే ఈరోజు పార్టీలో చేరుతున్నారని అన్నారు..తెరాస పార్టీ పై అభిమానంతో, నమ్మకంతో పార్టీ లో చేరిన వారికి ఎల్లపుడు అండగా నిలుస్తుందని అన్నారు…
ఈ కార్యక్రమంలో పరకాల మార్కెట్ చైర్మన్ బొజ్జం రమేష్ మరియు రైతు కో ఆర్డినెటర్ నాగుల అశోక్,బొల్ల శ్రీనివాస్,దోమల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు..