తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నూతన రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. లోపభూయిష్టంగా ఉన్న ప్రస్తుత చట్టం స్థానంలో సరికొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం భూ యాజమాన్య హక్కుల చట్టం-2020 (ఆర్ఓఆర్) ఈరోజు అసెంబ్లీ ముందుకు రానున్నది.
పరిపాలనతో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్.. అనేక చట్టాలు, క్లిష్టమైన నిబంధనలతో కూడిన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళనచేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చట్టానికి రూపకల్పన చేసింది .
ఇప్పటికే వీఆర్వో వ్యవస్థకు స్వస్తి పలికిన ప్రభుత్వం, తాజాగా రెవెన్యూ కోర్టులను కూడా రద్దు చేసింది. తెలంగాణ నేల కోసం.. జాతి జనుల కోసం నిరంతరం పరితపించిన ప్రజా కవి కాళోజీ జయంతి రోజున నూతన రెవెన్యూ చట్టాన్ని సభముందుకు తీసుకువస్తున్నది.