Home / SLIDER / హైదరాబాద్ కేంద్ర సమాచారశాఖలో కరోనా కలకలం…

హైదరాబాద్ కేంద్ర సమాచారశాఖలో కరోనా కలకలం…

తెలంగాణలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు. తాజాగా తెలంగాణ హోంశాఖ మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది.

కాగా, ఇప్పుడు కేంద్ర సమాచారశాఖలో కరోనా కలకలం రేగింది. కవాడిగూడలోని సీజీఎస్ టవర్స్ లోని పిఐబి కార్యాలయంలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. అడిషినల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ సహా కొందరు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది.

దీంతో కార్యాలయంలోని మిగతా ఉద్యోగులకు కరోనా టెస్టులు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. నగర ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat