ఏపీలో తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలో మే 21న నమోదైన పాజిటివ్ కేసు ద్వారా ఇప్పటివరకు 222 మంది వైరస్ బారిన పడ్డారు.
ఒక్క మామిడాడ గ్రామంలోనే 119 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ గ్రామం ఉన్న పెదపూడి మండలంలో మొత్తం కేసుల సంఖ్య 125కి చేరింది.
మే 21న మామిడాడలో గుర్తించిన కేసు ద్వారానే రాయవరం మండలంలోని చెల్లూరు పంచాయతీ సూర్యారావుపేటలో 57 మంది కూడా వైరస్ బారిన పడ్డారు.