Home / SLIDER / సిద్దిపేటలో ‘ఈ-ఆహార’ యాప్‌

సిద్దిపేటలో ‘ఈ-ఆహార’ యాప్‌

లాక్‌డౌన్‌ అమలులో భాగంగా ఇంటికే నిత్యావసర సరుకులు, కూరగాయల రవాణా చేస్తాం.. ఇంటి నుంచి ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఉంటే వైరస్‌ లింక్‌ తెగిపోతుందని నిపుణులు పేర్కొంటున్నందునే లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టం చేస్తున్నాం.. ఇందులో భాగంగానే ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఈ- ఆహార’ యాప్‌ను ప్రారంభిస్తున్నాం’ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

ఇంటింటికీ నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించేందుకు ప్రత్యేక యాప్‌ రూపొందించిన మహ్మద్‌ సభిని మంత్రి హరీశ్‌రావు అభినందించి మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ప్రారంభించారు. సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా అమలుచేసిన తరువాత జిల్లా వ్యాప్తంగా అమలులోకి తెస్తామని మంత్రి తెలిపారు.

ప్రజలకు మరింత సౌకర్యవంతంగా నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఈ యాప్‌ ద్వారా కనీసం రూ.100 విలువైన కూరగాయలు ఆర్డర్‌ చేస్తే 24 గంటల్లో వినియోగదారులకు అందజేస్తారని.. రోజూ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 12 నుంచి 16 రకాల కూరగాయలు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat