వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా అత్యవసర సేవలపై స్పందించారు. ఒక్క ఫోన్ కాల్ తో ఇంటి ముంగిటికి వచ్చే 108, 104 అంబులెన్సు సర్వీసులను సిఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్ గారు పరిపుష్ఠం చేశారు. ఆపత్కాలంలో వాటి లభ్యతతో ప్రజలు నిశ్చింతగా ఉన్నారు. మూలపడిన ఈ అత్యవసర సర్వీసులు ఇప్పుడు ప్రాణం పోసుకుని ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి.
మరో ట్వీట్ లో “అసెంబ్లీ, రెవిన్యూ డివిజన్, జిల్లా స్థాయిల వరకు మూడంచెల్లో ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ ఏర్పాట్లు చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానిదే. విదేశాల నుంచి వచ్చిన వారందరిని వైద్యులు పరీక్షించి ఐసోలేషన్ లో ఉంచడం, స్వల్ప లక్షణాలు కన్పించినా టెస్టులు చేయడం ప్రభుత్వ ముందు జాగ్రత్తలను సూచిస్తోంది” అని అన్నారు .
Post Views: 280