తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు అన్నిచోట్లా వాహనాల రాకపోకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. బారికేడ్లను అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో చెక్ పోస్టుల వద్ద వాహనాలు నిలిపి వేస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ తెలంగాణల మధ్య రాకపోకలు కొనసాగట్లేదు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగంలాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుంది. నిర్దిష్టమైన కారణం లేకుండా వాహనాలతో రోడ్లపైకి వచ్చి వాళ్ళను నిలిపివేసి ఫైన్ విధిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి ఎవరూ రావద్దంటూ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు రెండు రాష్ట్రాల్లోనూ పారిశుద్ధ్య కార్మికుల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులకు ప్రజలు కృతజతలు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్లే అసలైన హీరోలు.
