క్రికెట్ లో రెండు దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే అటు అభిమానులు, ఇటు ప్లేయర్స్ ఎవరికి వారు పరస్పర అనుబంధాలతో కలిసి మెలిసి ఉంటారు. ఆట పరంగా ఎంత తేడా ఉన్నా మానవత్వం పరంగా చాలా సరదాగా ఉంటారు. వారు కలిసినప్పుడల్లా కరచాలన చేసుకోవడం దగ్గరగా హత్తుకోవడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా టాస్ వేసే సమయంలో కూడా ఇరు జట్ల సారధులు కరచాలన చేసుకుంటారు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటికి దూరంగా ఉంటున్నారు. దీనంతటికి కారణం ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్. ఈ వైరస్ వల్ల అభిమానులు, క్రికెటర్లు అందరు వణుకుతున్నారు.