ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా, సామాజికరంగాల్లో చేసిన కృషిని, అందించిన సేవలను సీఎం కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పొత్తూరి అందించిన నైతిక మద్దతును కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
