ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో మీముందుకు రానుంది. ఈమేరకు సర్వం సిద్దం చేసారు. మరోపక్క జట్లకు సంబంధించి ఆయా యాజమాన్యం ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చేసింది. అయితే తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఐపీఎల్ కు ముందువరకు ఆ జట్టుకు సారధిగా కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఉండేవాడు. అతడి సారధ్యంలో జట్టు మంచి విజయాలు అందుకుంది. అతడి స్థానంలో ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను కెప్టెన్ గా ప్రకటించింది యాజమాన్యం. ఇద్దరిలో ఎవరైనా జట్టుకి మంచిందేనని అభిమానులు భావిస్తున్నారు.
