ఇటీవల కేరళలో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ జూలీ అమ్మా జోసెఫ్ ఆత్మహత్య చేసుకునేందుకు పాల్పడింది. ప్రస్తుతం కోజికోడ్ జైలులో ఉన్న ఆమె గురువారం ఉదయం తన చేతిని కోసుకుంది. దాంతో జైలు అధికారులు ఆహెను చికిత్సకోసం కోజికోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జూలీ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆస్తికోసం 18 ఏళ్లకే సొంత కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల్ని జూలీ మర్డర్ చేసింది. అంతేకాదు.. కట్టుకున్న భర్త రాయ్ థామస్ను కూడా ఆమె దారుణంగా చంపేసింది. వారంతా ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు కథ అల్లింది. అయితే కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో రాయ్ థామస్ సోదరుడు మోజోకు అనుమానం వచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేయగా జూలీ చేసి దారుణ హత్యలు వెలుగుచూసాయి. కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. రాయ్ థామస్ సైనైడ్ వల్ల చనిపోయినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మిగతా ఐదుగురు కుటుంబ సభ్యుల మరణాలపై పోలీసులు దర్యాప్తు చేయగా వారు కూడా సైనైడ్ వల్లే ప్రాణాలు విడిచారని తేలింది. దీంతో ఈమరణాలన్నింటికీ ప్రధాన సాక్షిగా భావించిన పోలీసులు జూలీని విచారించగా ఆమె చేసిన అరాచకాలు బయటపడ్డాయి. దీంతో జూలీతో పాటు ఆమె రెండో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఇక్కడ కూడా ఏవైనా నాటకాలు వేసి తప్పించుకునేందుకే అని ఆమెపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
