ఏపీలో మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వచ్చే నెల రెండు లేదా మూడో తారీఖు నుండి ఈ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఆరో తారీఖున ఏకాదశి నాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
దీనిపై ఇవాళో రేపో ప్రభుత్వ అధికారక ప్రకటన వెలువడనున్నట్లు ఏపీ వర్గాల్లో వినిపిస్తుంది.