గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నేడు సినిమా హీరో అర్జున్ తన నివాసంలో Actor Arjun Garden Q2, Gerugambakkam, Tamil Nadu 600116 లో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గారు వెళ్లి అర్జున్ తో మొక్కలు నాటించడం గొప్ప శుభపరిణామం. పర్యావరణ పరిరక్షణ కి తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు ఎంపీ సంతోష్ గారు చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్పూర్తిగా తీసుకొని రోజా మొక్కలు నాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా హీరో అర్జున్ మాట్లాడుతూ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని భావితరాలకు మంచి ఆక్సిజన్ అందించాలనే సంకల్పం గొప్పది . దానికి రోజా గారు మొక్కలు నాటించే కార్యక్రమం చెప్పట్టడం చాలా అభినందనియం అన్నారు . ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజావనం లో జగపతిబాబు గారు , ప్రముఖ దర్శకుడు ఆర్కే సల్వామని గారు , మరియు ఉత్తమ నటి కుష్బూ గారిని పాల్గొనాలని వారికి ఛాలెంజ్ విసిరారు. రోజా గారు మొక్కలు నాటించడం గొప్ప శుభపరిణామం అని సంతోష్ కుమార్ గారు ప్రత్యేకంగా అభినందించారు.