Home / SLIDER / డీసీసీబీ పాలకవర్గాల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

డీసీసీబీ పాలకవర్గాల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు సహకార శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 22న జిల్లా సహకార ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. 25న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంట వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు.

ఈనెల 28న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి… ఫలితాలు వెల్లడిస్తారు. ఫిబ్రవరి 29న డీసీసీబీ బేరర్స్ ఎన్నిక జరుగుతుందని సహకార శాఖ ఎన్నికల అథారిటీ వర్గాలు తెలిపాయి.

9 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులపై పూర్తి ఆధిక్యత కనబరిచిన దృష్ట్యా… తెరాస అభ్యర్థులే అధ్యక్షులుగా ఎన్నికయ్యే అవకాశలు ఉన్నాయి. ఇప్పటికే పెద్దఎత్తున ఆశావహులు డీసీసీబీ ఛైర్మన్‌గిరీ కోసం మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేల ద్వారా తమవంతు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat