ప్రతి శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ నవ్వులు విందుకు స్వాగతం పలికే యాంకర్ రష్మి హాట్ లుక్స్తో దర్శనం ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది . తన ఫేస్ బుక్లో అంద చందాలతో దిగిన షేర్ చేసే రష్మి సెగలు పుట్టించే ఫొటోలకు పోజులు ఇస్తోంది. ఎప్పుడు ఇలా బుల్లి తెరపై సందడి చేస్తూనే… అడపాదడపా సినిమాల్లో నటిస్తూ యాంకర్ రష్మీ చాలా బిజీగానే ఉంటోంది. తాజాగా రష్మీకి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. వంద ఎకరాల వ్యవసాయ భూమిని ఆమె కొనుగోలు చేసిందనేదే ఆ వార్త. ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో తన సొంత ఊరైన బరంపురం ప్రాంతంలో ఈ భూమిని కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. దీని కోసం దాదాపు రూ. 5 కోట్లతో డీల్ జరిగినట్టు సమాచారం. ఈ భూమిలో యూకలిప్టస్, కోకా చెట్లను పెంచాలని ఆమె భావిస్తోందట.
