ఏపీ మాజీ సీఎం..ప్ర్తధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి భద్రత తగ్గించారు. రాజకీయ కోణంలోనే వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని ఆ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే బాబు భద్రతపై తెలుగు తమ్ముళ్ళు చేస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర డీజీపీ కార్యాలయం క్లారిటీచ్చారు.
బాబుకు భద్రతను తగ్గించామని వచ్చిన వార్తలను డీజీపీ ఆఫీసు కొట్టిపారేసింది.దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని మాజీ సీఎం అయిన నారా చంద్ర్తబాబు నాయుడుకు కల్పిస్తున్నట్లు పేర్కొన్నది.
జడ్ ప్లస్ సెక్యూరిటీతో భద్రత కల్పిస్తున్నాము. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు చేర్పులు చేశామని వివరించింది. ప్రస్తుతం ఆయనకు మొత్తం నూట ఎనబై మూడు మందితో భద్రత కల్పిస్తున్నాము అని డీజీపీ ఆఫీసు తెలిపింది.