వచ్చే ఏడాది కాలం లో విశాఖ కేంద్రంగా 50 వేల ఐటీ ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. మానవ వనరులే పెట్టుబడిగా పరిశ్రమలకు అవసరమైన వృత్తి నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడం తమ తొలి ప్రాధాన్యంగా పేర్కొన్నారు. యువతలో వృత్తి నిపుణతను పెంపొందించేందుకు రాష్ట్రంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో స్కిల్ కాలేజ్లను, నాలుగు ప్రాంతాల్లో సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 4,600 కోట్ల మేర పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను నిలిపివేయడంపై ఆయన స్పందిస్తూ ప్రోత్సాహకాల విషయంలో గత ప్రభుత్వం సరైన విధానాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. మన తాహతును బట్టి ప్రోత్సాహకాలు ఇవ్వాలని, అటువంటిది అలోచన లేకుండా ప్రకటించిన ప్రోత్సాహకాలను గత ప్రభు త్వం చెల్లించలేదన్నారు. అయితే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయంలో తాము పూర్తి పారదర్శకంగా ఉంటామన్నారు. ఇప్పటి వరకూ పెండింగ్లో ఉన్న పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపు విషయంలో కూడా సరైన విధానాన్ని అ మలు చేస్తామన్నారు
