జార్ఖండ్లోని రాంచీలో ప్రేమికుల రోజన ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. మోరహాబాదీలో ఉన్న ఆక్సిజన్ పార్కులో కొంత మంది యువకులు ఒక ప్రేమ జంటకు బలవంతంగా వివాహం జరిపించారు. వివరాల్లోకి వెళితే ప్రేమికుల రోజున పలు ప్రేమ జంటలు పార్కులో విహరిస్తుండగా, కొందరు యువకులు అక్కడకు వచ్చారు. వారిని చూసిన యువకులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆ యవకులు ఒక ప్రేమజంటను పట్టుకున్నారు. వారిని చూసి భయపడిన ఆ యువకుడు ఆమె తన భార్య అని చెప్పాడు. దీంతో ఆ యువకులు తమ దగ్గరున్నకుంకుమను ఆ యువకునికి ఇచ్చి, ఆ యువతి నుదుటన పెట్టమని ఆదేశించారు. దీంతో ఆ యువకుడు తప్పించుకునే మార్గం లేక ఆ యువతి నుదుట కుంకుమ పెట్టాడు. తరువాత ఆ యువకులు… ఆ యువకునితో యువతి ఇంటిలోని వారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పమన్నారు. అయితే ఇంతలోనే సీఆర్పీఎఫ్ జవాను అక్కడికి వచ్చారు. జవానును చూసి ఆ యువకులంతా అక్కడి నుంచి పారిపోయారు. కాగా ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఎటువంటి కేసు నమోదు కాలేదు.
