తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటనలో భాగంగా నిన్న రాత్రి కరీంనగర్ లోని తీగలగుట్టపల్లికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఈ రోజు ఉదయం కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత లక్ష్మీబరాజ్ను సందర్శించనున్నారు.
సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ వివరాలు..
* ఇవాళ ఉదయం 8.50 గంటలకు కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి నుంచి రోడ్డుమార్గంలో కరీంనగర్ కలెక్టరేట్లోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. 9.05 గంటలకు హెలికాప్టర్లో కాళేశ్వరం బయలుదేరుతారు.
* 9.30 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద ఉన్న హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డుమార్గంలో కాళేశ్వరం ఆలయానికి చేరుకుని శ్రీకాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకుంటారు. గోదావరిఘాట్ను కూడా సందర్శిస్తారు.
* ఉదయం 10.10 గంటలకు అక్కడినుంచి తిరిగి పయనమవుతారు.
* ఉదయం 10.30 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబట్పల్లి గ్రామ పరిధిలోని లక్ష్మీబరాజ్కు చేరుకుంటారు. బరాజ్ను సందర్శిస్తారు.
* మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం చేసి.. రెండుగంటలకు హెలికాప్టర్లో కరీంనగర్కు బయలుదేరుతారు.
* 2.40 గంటలకు కరీంనగర్లోని తీగలగుట్టపల్లి చేరుకుని..వీలును బట్టి హైదరాబాద్ తిరుగుపయనమవుతారు.