Home / NATIONAL / ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు..!

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు..!

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ కాన్వాయ్‌పై మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై ఆ దుండగుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నరేష్‌ యాదవ్‌ గుడికి వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ కార్యకర్త మృతి చెందగా, మరో కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి.

దీనిపై ఆప్‌ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడతూ.. ‘ఈ ఘటన జరగటం చాలా దురదృష్టకరం. ఈ దాడి ఎందుకు జరిగిందో నాకు తెలియదు. నాపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా ఆ దుండగుడిని గుర్తించి పట్టుకోవాలి’ అని ఆయన అన్నారు. నరేష్‌ యాదవ్‌ మెహ్‌రౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్‌ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు జరగటం ఢిల్లీలో
చర్చనీయం అంశంగా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat