ప్రభుత్వ వైఫల్యాలపై బస్సు యాత్ర చేసే యోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లుతెలుస్తోంది. 45 రోజుల బస్సుయాత్రను చంద్రబాబు ప్రతిపాదించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఆయన పార్టీ మీటింగ్లో ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. 13 జిల్లాలు, 100కు పైగా నియోజకవర్గాలు కవరయ్యేలా యాత్ర చేయాలని భావిస్తున్నారు. జనచైతన్య పేరుతో బస్సు యాత్ర చేద్దామని సమావేశంలో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే యాత్ర చేయాలనే ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. విజయవాడ కానూరులో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు.
