Home / SLIDER / పసుపు బోర్డు కావాలి.. స్పైస్‌బోర్డు రీజినల్ ఆఫీసు కాదు..

పసుపు బోర్డు కావాలి.. స్పైస్‌బోర్డు రీజినల్ ఆఫీసు కాదు..

పసుపు బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం పసుపును కొని మద్దతు ధర ఇవ్వాలి. ఇదీ రైతులు డిమాండ్ చేస్తున్నది. ఇది వరకే స్పైస్‌బోర్డుకు వరంగల్‌లో ఓ ఆఫీసున్నది… ఓ ఇద్దరు ఆఫీసర్లతో నిజామాబాద్‌లో మరో ఆఫీసు పెడతామంటున్నారు. దాంతో లాభమేమి లేదు. వరంగల్‌లో ఉన్నా.. నిజామాబాద్‌లో ఉన్నా ఒకటే. నిజామాబాద్‌లో ఓ ఆఫీసు పెడితే రైతులకు ఏం ఉపయోగం లేదు. అర్వింద్ ఇన్ని రోజులు మాయమాటలు చెప్పి.. కొత్త నాటకం ఆడుతున్నడు.

కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలిగింది పసుపు బోర్డు ఒక్కటే. రైతులకు ఏమన్నా మేలు చేయాలంటే .. పసుపుబోర్డు వెంటనే ఏర్పాటు చేయాలె..మద్దతు ధర ప్రకటించి కేంద్రమే కొనుగోలు చేయాలి. ఇదే రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంగా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సాగు నీరు తెస్తున్నారు. ఎకరానికి పదివేల రూపాయల మద్దతు ధర ఇస్తున్నారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో సరఫరా అయ్యేలా చూస్తున్నారు.

రైతులకు 24 గంటల కరెంటునిస్తున్నారు. రైతులకు ఏమేమి అవసరమున్నాయో.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఏమేమి చేయాలో అన్నీ కేసీఆర్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇదొక్క పని చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. కానీ ఇలాంటి తప్పుడు ప్రకటనలిచ్చి మోసం చేసే పని మానుకోవాలి. వరంగల్‌లో స్పైస్‌బోర్డు రీజనల్ ఆఫీసు ఇప్పటికి ఉన్నదే. అక్కడ నుంచి నిజామాబాద్‌కు తెరిచినంత మాత్రాన దాంతో అయ్యేదేమీ లేదు. పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇదొక్క పని కూడా రైతుల కోసం కేంద్రం చెయ్యదా? అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీజేపీని ప్రశ్నించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat