Home / ANDHRAPRADESH / ఈ జిల్లాకు ఫిబ్రవరి 3న సీఎం వైఎస్‌ జగన్‌ రాక

ఈ జిల్లాకు ఫిబ్రవరి 3న సీఎం వైఎస్‌ జగన్‌ రాక

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ నెల మూడో తేదీన విశాఖ నగరానికి వెళ్లనున్నారు. శ్రీశారదాపీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొంటారని పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మూడో తేదీ ఉదయం 9 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి 9.20కి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 10.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రోడ్డు మార్గంలో విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.40 గంటలకు చినముషిడివాడలోని శారదా పీఠానికి చేరుకుంటారు. 12.30 గంటల వరకు వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతర శారదాపీఠం నుంచి 12.50కి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఒంటిగంటకు విమానంలో బయలుదేరి 1.40కి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 2.10 గంటలకు తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకుంటారని పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat