ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తరువాత తాజాగా ఇప్పుడు న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఆడనుంది. ముంబై వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయిన ఇండియా ఆ తరువాత ఆడిన రెండు మ్యాచ్ లు కసిగా ఆడి గెలిచి చివరికి సిరీస్ గెలుచుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్ తో టీ20 కి సిద్దమయింది. ఇక అసలు విషయం ఏమిటంటే మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు భారత్ వీరితో ఐదు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఇది భారత్ కు మొదటిది. అప్పట్లో 1947లో భారత్ ఆస్ట్రేలియాతో 5టెస్ట్ సిరీస్ ఆడగా, 1983లో 5వన్డేల సిరీస్ ఆడింది. ఇప్పటికే టీ20ల విషయంలో వారిపై భారత్ కు పెద్దగా విజయాలు లేవు. మరి ఈ సిరీస్ ఎలా ఉండబోతుందో చూడాలి.
