టీడీపీ అధినేత చంద్రబాబు సేవ్ అమరావతి పేరుతో రోజుకో కార్యక్రమంతో అమరావతి రైతుల ఆందోళన కార్యక్రమాలకు సారథ్యం వహిస్తున్నారు. బాబు స్వయంగా జోలెపట్టి భిక్షాటన చేస్తూ అమరావతి రైతుల ఆందోళనలను రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మల్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఒకపక్క కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు స్వాగతిస్తుంటే..చంద్రబాబు మాత్రం వైజాగ్లో రాజధానిని, కర్నూలులో హైకోర్ట్ ఏర్పాటును ఎవరూ కోరుకోవడం లేదంటూ మాట్లాడుతున్నారు. బాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్లపై సెటైర్లు వేశారు. ప్రధానులను డిసైడ్ చేశాను.. రాష్ట్రపతులను సెలెక్ట్ చేశానని… డప్పుకొట్టుకునే వ్యక్తి అమరావతిలో ఇన్సైడర్ భూములు కాపాడుకునేందుకు దిగజారి మాట్లాడుతున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలు వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ రాజధాని కోరుకోవడం లేదట…. కర్నూలు వాళ్లు జ్యుడీషియల్ క్యాపిటల్ వద్దేవద్దని ఈయన చెవిలో చెప్పారట…అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఇక ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడు పచ్చ మీడియా అనే ‘కీలు గుర్రం’ ఎక్కి స్వారీ చేస్తున్నారు. రివ్వున ఎగిరినట్టు కలల్లో తేలిపోతున్నారంటూ లోకేష్, పవన్లపై ఎంపీ సైటైర్లు వేశారు. బాబు, లోకేష్, పవన్లు పరమ అవమానకరంగా పరాజయం పాలై ఆరు నెలలు తిరగక ముందే చిటెకలు వేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు….ఎవరైనా చెప్పండయ్యా. వెకిలి చేష్టలతో పరువు తీసుకోవద్దని…అంటూ విజయసాయిరెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. మొత్తంగా చంద్రబాబు అమరావతి రాజకీయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
