గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటింది బిగ్ బాస్3షో ఫేం వితిక షేర్ .టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శ్రీముఖి ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించింది.
తన నివాసంలో తన తల్లి అత్తమ్మ తో కలిసి ఆమె మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా విత్తక శేర్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని అందులో కి నన్ను కూడా భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు .
ఈ సందర్భంగా మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడ అందరం తీసుకోవాలి అని వితిక పిలుపునిచ్చారు..ఈ క్రమంలో ఆమె మరోక ముగ్గురికి 1) నటులు నందు2) కార్తికేయ 3)సింగర్ హేమచంద్ర ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.