ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ గా నియమితులైన తర్వాత తొలిసారిగా సోమేశ్ కుమార్ ఈ రోజు ఆదివారం యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్నారు.
మొదటిసారిగా యాదాద్రికి వచ్చిన సీఎస్ సోమేశ్ కుమార్ దంపతులకు వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదాశీర్వరచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.