ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య బళ్లారి రక్షిత అటవీ ప్రాంత సరిహద్దు వివాదం అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం అమరావతి సచివాలయంలో సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ బళ్ళారి రక్షిత అటవీ ప్రాంతానికి సంబంధించి ఇరు రాష్ట్రాలకు చెందిన సరిహద్దు వివాదం సకాలంలో పరిష్కారం అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రానికి సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించేందుకు చర్యలు తీసుకోవాలని భూగర్భ గనులు, అటవీ పర్యావరణ, సర్వే శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈవివాదానికి తుది పరిష్కారం చేయాల్సి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్రానికి సమర్పించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.
