నూతన సంవత్సరం సందర్భంగా రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బంపరాఫర్ ప్రకటించింది. రేపు శ్రీవారిని దర్శించుకునే వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతే కాదు అదనంగా లడ్డూలు కావాలంటే ఎలాంటి సిఫార్స్ లేఖలు లేకుండానే కౌంటర్లోనే కావల్సిన లడ్డూలు కొనుగోలు చేసుకునే సౌలభ్యాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. కాగా టీటీడీ ఇక నుంచి నెలకు 24 లక్షల లడ్డులను ఉచితంగా భక్తులకు పంపిణీ చేయనుండడం గమనార్హం. రానున్న వైకుంఠ ఏకాదశి నుంచి ఈ నూతన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. మొత్తంగా నూతన సంవత్సరం సందర్భంగా టీటీడీ ఉచిత లడ్డూలు అందిస్తుండడంతో శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
