ఇంకొన్ని గంటల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి సరికొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి విదితమే. అయితే రేపు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపు తప్పకుండా చేయాల్సిన కొన్ని పనులున్నాయి. అవి ఏంటో తెలుసుకుందామా..?
* ఆధార్ – పాన్ లింక్
దేశంలో ఉన్న పాన్ కార్డు వినియోగదారులంతా తమ తమ కార్డులను ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపు ఆధార్ కార్డుకు లింకప్ చేస్కోవాలని ఆదాయ పన్ను శాఖ తెలిపింది.
* ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్
2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు గాను ఇంకా ఇన్కమ్టాక్స్ రిటర్న్స్ను ఫైల్ చేయని వారు 2019, డిసెంబర్ 31వ తేదీ లోపు రూ.5వేల ఆలస్య రుసుముతో ఆ రిటర్న్స్ను ఫైల్ చేసేందుకు ఐటీ శాఖ గడువిచ్చింది. ఇక డిసెంబర్ 31వ తేదీ దాటితే రూ.10వేల ఆలస్య రుసుముతో రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.
* ఎస్బీఐ ఏటీఎం కమ్ డెబిట్ కార్డు మార్పు…
పాత ఎస్బీఐ ఏటీఎం కమ్ డెబిట్ కార్డులను వాడుతున్న వారు 2019, డిసెంబర్ 31వ తేదీ లోపు ఆ కార్డులను కొత్త ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులతో మార్చుకోవాల్సి ఉంటుందని ఎస్బీఐ తెలిపింది. లేదంటే పాత కార్డులు 1వ తేదీ నుంచి పనిచేయవు.
*అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు…
దేశంలోని ఈశాన్య రాష్ర్టాలకు చెందిన వారు తమ అడ్వాన్స్ టాక్స్ను చెల్లించేందుకు డిసెంబర్ 31వ తేదీని ఆఖరి గడువుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నిర్ణయించింది.
* ఎల్ఆర్ఎస్ గడువు…
స్థలాల క్రమబద్దీకరణ (ఎల్ఆర్ఎస్)కు గాను హెచ్ఎండీఏ డిసెంబర్ 31వ తేదీ వరకు ఆఖరి గడువును నిర్ణయించింది.