టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్లోని ఆమె నివాసంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారుల దాడులు చేశారు. ట్యాక్స్ కట్టడం లేదన్న ఆరోపణలు రావడంతో ఆమెపై అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న లావణ్య సినిమా షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి చేరుకుంది. అయితే ఆమె ఇంటితో పాటు నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో డీజీజీఐ అధికారులు దాడులు చేస్తున్నట్లు సమాచారం.
