కాకినాడలో జనసేన అధినేత చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షకు హాజరు కాకపోవడంతో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు జనసేన అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసిన సంగతి తెలిసిందే..రెండు రోజుల్లో అధ్యక్షుడు పవన్ సభకు ఎందుకు హాజరు కాలేదో సమాధానం చెప్పకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడం..ఇది పవన్ కల్యాణ్ మాట అంటూ జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఈ మేరకు డిసెంబర్ 11న ప్రెస్నోట్ కూడా విడుదల చేశారు. అయితే తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై రాజోలు ఎమ్మెల్యే రాపాక స్పందించారు. నాకు ఎవరో షోకాజ్ నోటీసు ఇవ్వడం ఏంటి? నేను గెలిచిన ఎమ్మెల్యేను..వాళ్లు ఓడిపోయిన వారు…ఇది మరీ విచిత్రంగా ఉందంటూ రాపాక పవన్కు కౌంటర్ ఇచ్చారు. అసలు పార్టీ మీద ఏదైనా అధికారం అనేది ఉంది అంటే అది నాకు మాత్రమే ఉందని రాపాక తేల్చి చెప్పారు. జనసేన పార్టీ వల్లనో, కార్యకర్తల వల్లనో నేను గెలవలేదు…నా సొంత శక్తి తో గెలిచాను తప్ప నేను ఎవరి భిక్షతో ఎమ్మెల్యే కాలేదని..పవన్కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. నాకు వచ్చిననన్ని ఓట్లు తెచ్చుకోలేనోడు, చదువులేని వాళ్ళా నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చేది? అంటూ రాపాక ఓ రేంజ్లో పవన్పై ఫైర్ అయ్యారు. అంతగా నన్ను గెలిపించే వాళ్లే అయితే పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఎందుకు ఓడిపోయారని…రాపాక ప్రశ్నించారు. ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి… నన్ను ఆయన సస్పెండ్ చేయడం ఏంటి? ఈ మాట చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందంటూ ఎద్దేశా చేశారు. అసలు ఓ. దిశ, నిర్దేశం లేని పార్టీలో ఉండటం నాకే ఇష్టం లేదని రాపాక అన్నారు. నేను రాజీనామా చేసి మళ్ళీ గెలిచే శక్తి నాకు ఉంది..ఆయనకు రాష్ట్రం లో ఎక్కడైనా గెలిచే సత్తా ఉందా అని అడుగుతున్నా అని రాపాక పవన్ పై ఫైర్ అయ్యారు. ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు,,షోకాజ్ నోటీసులు అంటూ చెత్త ప్రకటనలు చెత్త పేపర్లలో విడుదల చేస్తే నేను ఏమి చేయాలో నాకు బాగా తెలుసని రాపాక పవన్కు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చారు.. మొత్తంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్కు నేనే షోకాజ్ నోటీస్ ఇస్తా అంటూ రాపాక చేసిన వ్యాఖ్యలు..జనసేన పార్టీ శ్రేణుల్లో కాకరేపుతున్నాయి.
