దేశ చరిత్రలో అగ్రభాగాన కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్కు దేశంలోనే అగ్రభాగాన నిలవబోతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జెడ్పిచైర్మన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ హరిత… కొరియా నుండి వచ్చిన యంగ్ వన్ కంపెనీ చైర్మన్ కీయాన్ సూవ్ మరియు బృందంతో కలిసి పార్కును సందర్శించారు. ఈ కంపెనీ 290 ఎకరాలలో సింతటిక్, జాకెట్లు, బూట్లు, ట్రాక్ సూట్, ట్రెక్కింగ్ చేయడానికి వేసుకునే డ్రెస్సులు ఈ కంపెనీ తయారు చేయనుంది. ఈ కంపెనీ రూ. 1000 కోట్ల వ్యయంతో 8 యూనిట్లుగా కంపెనీ ప్రారంభించనుంది. ఈ కంపెనీలో ప్రత్యేక్షంగా, పరోక్షంగా 12 వేల మందికి ఉపాధి కలగనుంది.
