దిశ హత్యాచారం జరిగి 9 రోజులు కావస్తోంది. హత్యాచారం జరిగిన 24 గంటలలోపే నింధితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో హంతకులను ఉరితీయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలి అనే నినాదాలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. చివరకు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. పోలీసులు. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెడుతూ ఎదురు దాడికి దిగారు. పోలీసులపై రాళ్లు దువ్వి పోలీసు వాహనాలపై రాళ్లడాడి చేశారు. దీంతో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేశారు. దిశ హత్యాచారం కేసులో జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఎక్కడైతే.. దిశ మరణించిందో.. అదే ప్రదేశంలో.. నిందితులను ఎన్కౌంటర్ చేసారు పోలీసులు.
కాగా.. ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం అధికారికంగా వెల్లడించారు పోలీసులు. గత రాత్రి సీన్ రీ కన్స్ట్రేషన్ చేస్తుండగా.. నలుగురూ తప్పించుకునేందుకు ప్రయత్నించారని.. దీంతో.. వారిపై.. కాల్పులు జరపక తప్పలేదని.. నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. చటాన్ పల్లి బ్రిడ్జ్ సమీపంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. పగటి సమయంలో సీన్ రీ కన్స్ట్రేషన్ చేస్తే ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని రాత్రి జనసంచారం లేని సమాయంలోనైతే తాము సజావుగా సీన్ రీ కన్స్ట్రేషన్ చేయవచ్చునని భావించిన పోలీసువారు తెల్లవారుజామున ఈ కార్యక్రమానికి తెరలేపారు. కానీ అనుకోని రీతిలో నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నించిన సందర్భంలో తెల్లవారు జామున 3 నుంచి 5.30 గంటల ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగినిట్టు సమాచారం.
హైదరాబాద్లో జరిగిన వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ హత్యాచారం కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా నిలిచింది. అంత్యంత కిరాతకంగా ఆమెను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన యావత్ భారతదేశాన్ని కలచివేసింది. ఈ హత్యపై అటు రాజకీయ నాయకులు ఇటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా.. ఈ నలుగురు నిందితులను ఉరి తీయాలంటూ ప్రజలందరూ పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు చేశారు.దివంగతనేత సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో వరంగల్ లో జరిగిన యాసిడ్ దాడి కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసిన సజ్జనార్ వరంగల్ ఎస్పీయే ఇప్పుడు కూడా దిశ ఘటన నిందుతులను ఎన్కౌంటర్ చేసారు.