ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ మద్యం కొనుగోలుపై మరో సంచలన నిర్ణయం తీసుకుంది . సంపూర్ణ మద్య నిషేధం రాష్ట్రం దిశగా ఆయన పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా, బార్ల సంఖ్యను తగ్గించారు. అలాగే, కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టారు. మద్యం విక్రయ సమయాన్ని కూడా కుదించారు. తాజాగా ఇక నుండి ఎవరైనా మద్యాన్ని కొనుగోలు చేయాలంటే లిక్కర్ పర్చైజ్ కార్డ్ కొనాలి. ఆ కార్డ్ ను పొందాలంటే రూ.5 వేలు చెల్లించాలి. సాధారణంగా మొబైల్ నెట్ వర్క్ కి రీచార్జ్ చేసినట్లు సంవత్సరం గడవగానే మళ్లీ రూ.5 వేలు పెట్టి రీచార్జ్ చేయాలి. అందరికీ ఆ కార్డ్ ఇవ్వరు. 25 సంవత్సరాలు దాటినవారికి, గుర్తింపు పొందిన హస్పిటల్ డాక్టర్ నుండి ఏ జబ్బు లేదని మెడికల్ సర్టిఫికెట్ పొందినవారికి మాత్రమే ఆ కార్డ్ ఇవ్వబడుతుంది. మొత్తంమీద జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దేశంలో హాట్టాపిక్గా మారుతున్నారు.
