తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన చిన్నారి హేమకు అనారోగ్యంపై సీఎం ఆరా తీశారు.. ఇలాంటి నిరుపేదలను పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలకు ఇంతకముందే నిర్ణయం తీసుకున్నాం అన్నారు. క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని విడతలు చికిత్స అవసరమైనా చేయించండి అంటూ సీఎం ఆదేశించారు. చికిత్సలో ఎన్ని సైకిల్స్ అవసరమైనా పూర్తి ట్రీట్మెంట్ అందిస్తున్నామన్నారు సీఎం. గతంలో మాదిరిగా కాకుండా ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ రోగులకు ఏ పరిమితి లేకుండా చికిత్స చేయిస్తామన్నారు సీఎం. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తోందని,ఈలోగా అత్యవసర కేసులు ఉంటే.. ఆ రోగులకు వెంటనే చికిత్సలు అందించండని అధికారులకు సీఎం ఆదేశించారు. చిన్నారి హేమ కుటుంబంతో మాట్లాడి, వైద్యం కోసం అసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
