జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. కేలవం ఒకే ఒక సీటు గెలుచుకున్నారు. మరోపక్క తాను పోటీ చేసిన రెండుచోట్ల చాలా దారుణంగా ఓడిపోయాడు. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ చివరికి చంద్రబాబుకి దత్తపుత్రిడిగా అవతారం ఎత్తాడు.ఇక అసలు విషయానికి వస్తే ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఒక అజ్ఞాని, ఏమి చేతగాని వ్యక్తి. అలాంటి వ్యక్తి రైతుల సంక్షేమమని..జనసేన ధ్యేయం అని మాట్లాడుతుంటే ప్రజలకు ఒక్క మాట కూడా అర్ధం కావడంలేదని అన్నారు. గొంతు చించుకొని అరుస్తున్నారు తప్ప అందులో మేటర్ మాత్రం లేదు అన్నారు. రైతుల కోసం అంతలా ఆరాటపడితే వేల ఎకరాలు భూములు రైతుల నుండి బలవంతంగా లాక్కుంటే ఎందుకు మాట్లాడకుండా పారిపోయావ్ అని అడిగారు. ప్యాకేజీ ఎవరు ఇస్తే వారికి వత్తాసు పలకడం పవన్ కు మొదటినుండి ఉన్న గుణం అని ఆయన అన్నారు.