Home / SLIDER / ఉరి శిక్షే సరైనది..అంబటి రాయుడు

ఉరి శిక్షే సరైనది..అంబటి రాయుడు

తెలంగాణలో వెటర్నీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యపై ప్ర‌తి ఒక్క‌రి గుండెల్లో ఆగ్ర‌హా జ్వాల‌లు ర‌గిలిస్తుంది. నిందితులని న‌డిరోడ్డు మీద ఉరితీయాల‌ని దేశవ్యాప్తంగా నినాదాలు చేస్తున్నారు. సామాన్యజనం నుండి ప్రముఖుల వరకు గ‌ట్టిగా త‌మ వాద‌న వినిపిస్తున్నారు.

ఈ క్రమంలో టీమిండియా జట్టు ఆటగాళ్లు కూడా ట్విట్టర్ స్పందించారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రియాంక హత్యపై ట్విట్టర్‌లో స్పందించారు. సమాజం సిగ్గు పడే ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఇలాంటి అమానవీయ ఘటనలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని విరాట్‌ కోహ్లీ ట్విటర్‌లో తెలిపారు.

టీమిండియా క్రికెటర్‌ అంబటి రాయుడు దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని, మనుషులు సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని ట్విట్ చేశారు. అత్యాచార నిందితుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, వారికి వెంటనే ఉరి తీయాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat