టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత నారా లోకేశ్ పై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు, లోకేశ్ ల ఆధ్వర్యంలోనే అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ విషయం ప్రతిఒక్కరికీ తెలుసని అన్నారు. వీరి ప్రమేయం వుండటం వల్లే కింది స్థాయిలోనూ అవినీతి పెరిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా, సామాన్య మానవుడికి అవినీతి సెగ తగిలితే కనుక ఎంతటి గొప్ప చరిత్ర, బలం ఉన్న పార్టీ అయినా సరే మాడి మసి కావాల్సిందేనని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించిన మాట వాస్తవమే కానీ, ఎన్నికల సమయానికి పార్టీ పరిస్థితి చూసి తానే వెనుకడుగు వేశానని గుర్తుచేసుకున్నారు.
