Home / ANDHRAPRADESH / చంద్రబాబు అమరావతి పర్యటనపై మంత్రి కొడాలి నాని ఫైర్..!

చంద్రబాబు అమరావతి పర్యటనపై మంత్రి కొడాలి నాని ఫైర్..!

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల ఆందోళనల మధ్య చంద్రబాబు పర్యటన సాగుతోంది. అయితే ఇంద్ర సిన్మాలో మెగాస్టార్ చిరంజీవి హెలికాఫ్టర్ దిగి సీమ నేలను ముద్దాడినట్లు..అమరావతిలో బస్సు దిగగానే చంద్రబాబు అమరావతి నేలను ముద్దాడడం ఈ పర్యటనలో కొసమెరుపు. కాగా చంద్రబాబు రాజధాని పర్యటనపై మరోసారి మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. గత అయిదేళ్ల పాలనలో రాజధాని పేరుతో ఏ కట్టడం నిర్మించని చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అమరావతిలో తిరుగుతున్నాడని నాని మండిపడ్డారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను గాలికి వదిలేసిన బాబు ఇప్పుడూ నేల గుర్తొచ్చి ముద్దులు పెడుతున్నాడని విమర్శించారు. ఇన్నాళ్లు గ్రాఫిక్స్‌ను ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడని, అధికారం పోయాక ప్రజలు గూబ గుయ్యిమనించారని ఎద్దేవా చేశారు. రైతులను మోసం చేసినందుకు ఈ రోజు చెప్పులేసి చంద్రబాబును తరిమి కొట్టారని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు నిష్ట దరిద్రుడని, అందుకే రాజధానిలో మూడు నియోజకవర్గాల్లో ప్రజలు ఓడించారని విమర్శించారు. రైతులు, దళితుల నుంచి భూములు కొట్టేసిన గుండాలు, రౌడీలతో వచ్చి రాజధానిలో తిరుగుతున్నాడంటూ చంద్రబాబుపై ని మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా చంద్రబాబు రాజధాని పర్యటనలో నేలను ముద్దాడడంపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat