Home / ANDHRAPRADESH / సీపీఎస్ విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

సీపీఎస్ విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి  పాదయాత్రలో ఇచ్చిన హామీలను, నవరత్నాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న విషయం తెలిసిందే.ఈసారి ఉద్యోగస్తుల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దుకు సంబంధించిన విషయమై  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు అంశంపై వర్కింగ్‌ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేసింది. ఐదు శాఖల కార్యదర్శులతో కమిటీని నియమించింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా ఆర్థిక శాఖ కార్యదర్శి, సభ్యులుగా ప్లానింగ్, పాఠశాల విద్య, పంచాయతీ, వైద్యశాఖ కార్యదర్శులను నియమించారు.

 

 

 

ఎస్పీ టక్కర్‌ ఇచ్చిన నివేదికను ఈ వర్కింగ్‌ కమిటీ పరిశీలించనుంది. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను అనేక మంది ఉద్యోగులు కలిశారు. సీపీఎస్‌పై అధ్యయనం చేసి రద్దు చేస్తామని వైయస్‌ జగన్‌ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీపీఎస్‌ రద్దుకు సీఎం వైయస్‌ జగన్‌ కమిటీని నియమించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు మంచి చేకూరుతోందని గతంలో ప్రభుత్వాలు ఉద్యోగులను వాడుకున్నారు తప్ప ఉద్యోగుల బాగోగులను విస్మరించాయని, జగన్ ప్రభుత్వం వచ్చిన 5 నెలల లోనే రాష్ట్రం లో అనూహ్యమైన మార్పులను చేపట్టిందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat