Home / NATIONAL / బ్రేకింగ్.. కుప్పకూలిన విమానం.. 23మంది దుర్మరణం..!

బ్రేకింగ్.. కుప్పకూలిన విమానం.. 23మంది దుర్మరణం..!

ఆఫ్రికాలోని డీఆర్‌ కాంగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 23మంది మరణించారు. కాంగోలోని విమానాశ్రయం నుంచి ఉదయం 9గంటలకి విమానం టేకాఫ్‌ అవుతుండగా అక్కడి ఇళ్ల మధ్యలో కూలిపోయింది. ఇందులో 19 మంది ప్రయాణికులు సహా కొందరు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. గోమా నుంచి బయలుదేరిన బిజీబీ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన డోర్నియర్‌–228 రకం విమానం 350 కి.మీటర్ల దూరంలోని బెని చేరుకోవాల్సి ఉండగా ప్రమాదం జరిగింది.

విమానంలో 19మంది ప్రయాణికులు,  సిబ్బంది సహా మొత్తం 23మంది ఉన్నారు. ఐతే వీరిలో ఎవరూకూడా  ప్రాణాలతో బయటపడినట్లు దాఖలాలు లేవని అధికారులు తెలిపారు. బిజీ బీ విమానయాన సంస్థకు చెందిన డోర్నియర్ – 228 విమానం గోమా ఎయిర్ పోర్టు నుంచి 350 కి.మీ.లో ఉన్న బేనీకి వెళ్లాల్సి ఉంది. ఐతే గోమా ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి జనావాసాల్లో ఈ విమానం కుప్పకూలింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఈ ఘటన జరిగింది. ఇప్పటివరకు ఆరుగురు మృతదేహాలను బయటకు తీశామని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం పట్ల అందరూ తమ సంతాపాన్ని వ్యక్త పరుస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat