తన కెరీర్లో ఎక్కువగా కామెడీ ఎంటర్టైనర్లు తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఢమరుకం లాంటి ఫాంటసీ డ్రామా, శివమ్ లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్లను తెరకెక్కించాడు. అదే బాటలో ఇప్పుడు మరోసారి రూటూ మార్చి రాగల 24 గంటల్లో అంటూ క్రైమ్ థ్రిల్లర్ను రూపొందించాడు. ఈ మూవీలో సత్యదేవ్,ఈషా రెబ్బా,గణేష్ వెంకట్రామన్,రవివర్మ,శ్రీరామ్,ముస్కాన్ సేతి తదితరులు నటించారు.
ఈ మూవీలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటకు ఎదురయ్యే సమస్యలు.. కష్టాలను చూపిస్తూనే మరోవైపు మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ను అందించాడు దర్శకుడు. ఈ మూవీలో నటులంతా తమ తమ పాత్రలకు తగ్గట్లు నటించారు. సినిమాటోగ్రాఫర్ పడిన కష్టం తెరమీద స్పష్టంగా కనిపిస్తుంది. సంగీత దర్శకుడు రఘు కుంచే మరోసారి ఆకట్టుకోవడంతో పాటలు బాగున్నాయి.
సినిమాలోని నేపథ్యం సంగీతం కథా కథనాలకు తగ్గట్టుగా సరిగ్గా సరిపోయింది. లాంగ్ గ్యాప్ తరువాత మాటలు రచయితగా పనిచేసిన కృష్ణభగవాన్ తన మార్క్ చూపించాడు.ఎడిటింగ్ విషయంలో పర్వాలేదన్పించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉండటంతో మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో మంచి కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతుంది.