అనంతపురం జిల్లా రాప్తాడు నియోజక వర్గం నుండి పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యేగా తొలి సారి పోటీ చేసి ఘోరంగ ఓడిపోయాడు. అప్పటి నుంచి నియోజకవర్గానికి దాదాపుగా మొహం చాటేశారు. అంతకన్నా కామెడీ ఏమిటంటే.. ఇప్పుడు నియోజకవర్గం ప్రజల మీద పరిటాల ఫ్యామిలీ ఆప్యాయతలు ఏ పాటివో బయటపడుతూ ఉన్నాయి.ఎమ్మెల్యేగా తమను ఓడించారని వారు.. కొన్నాళ్ల కిందట తాము ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ లను విప్పేయిస్తూ ఉన్నారట. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి.పరిటాల ట్రస్టు ద్వారా అంటూ కొన్ని గ్రామాల్లో రెండు రూపాయలకే కొన్ని ప్యూరిఫైడ్ వాటర్ ను అందించే ప్రోగ్రామ్ ను అమలు చేశారు. అది కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నెగ్గిన తర్వాత. గవర్నమెంట్ ప్రోగ్రామ్ కు అనుసంధానించి ఆ వాటర్ ప్లాంట్స్ ను నడిపించారు. అయితే ఇటీవలి ఎన్నికల్లో జనాలు తమకు ఓటేయలేదని, పరిటాల రవి పేరుతో ట్రస్ట్ ద్వారా నిర్వహించిన వాటర్ ప్లాంట్స్ ను ఇప్పుడు విప్పేయించారట. వాటి ఎక్విప్ మెంట్ ను పరిటాల శ్రీరామ్ ఇంటికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఓడించారని చెప్పి, ట్రస్టు పేరుతో తాము ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను కూడా విప్పేసి ఇళ్లకు తీసుకుపోయేంత సేవా మూర్తులు వీళ్లు అని రాప్తాడు జనాలు గొణుక్కుంటున్నారు! అంతేకాదు మళ్లీ వచ్చే ఎన్నికల్లో నిలబడారా..వారు ఓట్లు వెయ్యార..ఎలా గెలుస్తారు అని అనుకుంటున్నారు.
