అండమాన్ పోర్ట్ బ్లెయిర్ లో ఈనెల నవంబర్ 27 నుండి డిసెంబర్ 6 వరకు జరగనున్న 65వ జాతీయ స్కూల్ గేమ్స్ ఫుట్ బాల్ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రెడీ అయ్యింది. బాలుర అండర్-19 జట్టు గత ఎనిమిది రోజులుగా జరుగుతున్న శిక్షణను ముగించుకొని ఈరోజు బయలుదేరింది . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ నాయకులు అంబటి మురళి క్రీడాకారులకు దుస్తులు మరియు కిట్లను అందజేశారు .ఈ క్రమంలో క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆటలో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు . ఈ కార్యక్రమంలో ప్రగతి కళాశాల డైరెక్టర్ పరిటాల నరేష్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్లు శివరామకృష్ణ , శ్రీనివాసరావు టీమ్ కోచ్ షేక్ మౌలాలి, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు .