తమిళనాడు ఆరాధ్య నటుడు రజనీకాంత్ గత రెండేళ్ల క్రితం 50 కోట్ల పారితోషికం తీసుకున్నారని తెలిసి అందరూ షాక్ కి గురయ్యారు.. అప్పట్లోనే మన హీరోల రెమ్యునరేషన్ ఆరాతీయగా తెలుగులో మాత్రమే మార్కెట్ ఉన్నటువంటి ఎన్టీఆర్ కు 20 కోట్లు, పవన్ కళ్యాణ్ కు 25 కోట్లు, మహేష్ బాబు 27 కోట్లు అని తెలిసి అందరూ నోరెళ్లబెట్టారు. అయితే ప్రస్తుతం తమిళ నటుడు అగ్ర కథానాయకుడు అయినటువంటి రజినీకాంత్ త్వరలో వస్తున్న సినిమాకు వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అయితే ప్రస్తుతం రజినీ తీసుకుంటున్న రెమ్యునిరేషన్ టాలీవుడ్ అగ్ర హీరోలతో పాటు తమిళ మలయాళ హీరోలతో పాటు బాలీవుడ్ నటులు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
