ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం అన్ని హామీలను అమలు పంచుకుంటూ పోతున్న జగన్ మద్యపాన నిషేధం కూడా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఎక్కడ 8 తర్వాత మద్యం దొరకడం లేదు. ఇప్పటికే ఉన్న మద్యం షాపులను సగానికి సగం వరకు జగన్ తగ్గించేశారు.. ఎక్కడా కూడా బెల్టుషాపుల నిర్వహణ లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ మధ్యనే దానికి సంబంధించి అత్యంత వేగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యనిషేధం ప్రభావం ప్రజల్లో పడటం లేదనే అంచనాకు వచ్చిన జగన్ ఇప్పుడు మద్యం షాపుల్లో 40 శాతం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నారు.. ఈ మేరకు క్యాబినెట్ మంత్రి నారాయణస్వామి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
