Home / ANDHRAPRADESH / రాష్ట్ర చరిత్రలోనే తొలి సీఎంగా వైఎస్‌ జగన్‌

రాష్ట్ర చరిత్రలోనే తొలి సీఎంగా వైఎస్‌ జగన్‌

బాలల దినోత్సవం సందర్భంగా ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర పాఠశాలలో ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. అంతకుముందు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు – నేడు కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు.

‘మనబడి నాడు-నేడు’లో భాగంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.12 వేల కోట్లను కేటాయించనుంది. తొలి దశలో 15,715 పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాలతో అభివృద్ది చేయనున్నారు. అయితే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా సర్కారీ స్కూళ్లకు ఇంత భారీ బడ్జెట్‌ కేటాయించిన తొలి సీఎంగా వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat