ఢిల్లీ వేదికగా నిన్న భారత్, బంగ్లాదేశ్ మధ్య మొదటి టీ20 జరగగా…ఇండియా ఓడిపోయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా మొదటి ఓవర్ లోనే కెప్టెన్ రోహిత్ ను అవుట్ చేసారు. భారత్ కు అక్కడే మొదటి దెబ్బ అని చెప్పాలి. మరో ఎండ్ లో ధావన్ నెమ్మదిగా ఆడుతున్న స్కోర్ ని ముందుకు నడిపే ప్రయత్నంలో విఫలమయ్యాడు. చివరిలో వచ్చిన సుందర్, పాండ్య స్కోర్ ను 148కి తీసుకెళ్ళారు. అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన బంగ్లా నెమ్మదిగా ఆడుతూ స్కోర్ ను ముందుకు తీసుకెళ్లగా చివర్లో కీపర్ రహీమ్ అద్భుతమైన బ్యాట్టింగ్ తో విజయం సాధించారు. ఇప్పటివరకు జరిగిన ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ లో నిన్న ఆడిన మ్యాచ్ 1000వ ది. ఇది గెలిచి ఉంటే వేరేలా ఉండేదని విశ్లేషకులు బావిస్తున్నారు.
